YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

370, 35A బిల్లుకు మద్దతు ఇవ్వాలని పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన మోడీ

 370, 35A బిల్లుకు మద్దతు ఇవ్వాలని  పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన మోడీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జమ్మూ కశ్మీర్ 370, 35A బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. ఇందుకు ఆయా సీఎంలు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే BSP, అన్నాడీఎంకే మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది.  PDP పార్టీ కి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో వారిని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్  సభను వాకౌట్ చేయగా.. బిల్లును JDU వ్యతిరేకించింది. కశ్మీర్ ప్రజలకు ఇప్పుడు న్యాయం జరిగిందని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఉమ్మడి జమ్మూ కశ్మీర్ ను జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు తెలుపగా..  జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలితంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలితంగా కానుంది. అయితే  కశ్మీర్ విషయంలో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు అమిత్ షా.

Related Posts