YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాలు... తగ్గిన రాష్ట్రాలు

పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాలు... తగ్గిన రాష్ట్రాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశంలో రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. జమ్మూకశ్మీర్ రాష్ర్టాన్ని కేంద్రం రెండు భాగాలుగా విభజన చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి లడఖ్ ను వేరు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ర్టాల సంఖ్య 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడక ముందు మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను వెనువెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.

Related Posts