YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

బైకు దొంగలు ఆరెస్టు

బైకు దొంగలు ఆరెస్టు

హైదరాబాద్ నగరంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు.  ఈ ముఠా వివిధ పోలీస్ స్టేషన్లు పరిధిలో  మోటారు సైకిళ్లను దొంగతనం చేసి పల్లెటూర్లలో రైతులకు తక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుంటుందని పోలీసులు గుర్తించారు. మర్రి నాగరాజు , అల్లూరి విజయ్ ఇద్దరు  ఒక ముఠాగా తయారయ్యి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లు పరిధిలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించేవారు.  ఇలా దొంగిలించిన వాహనాలను పల్లెటూర్లో ఉన్న రైతులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.   వీరికి పాత నేరాలతో సంబంధం ఉందని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూపారీ తీసుకుని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని తగలబెట్టిన కేసులో కూడా నిందితులుగా ఉన్నారని అంతేకాకుండా ఒక మర్డర్ కేసులో కూడా నాగరాజు నిందితుడని పోలీసులు తెలిపారు.       వీరిద్దరూ త్వరలో దోపిడీ చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారని దానికి సంబంధించి సుమారు 25  ప్రాంతాలలో రెక్కీ కూడా నిర్వహించినట్లు రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. వీరివద్ద నుండి 55 మోటార్ సైకిళ్ళు ను, రెండు డమ్మీ రివాల్వర్ లను, రెండు తల్వార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు.

Related Posts