YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ కన్నుమూత

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. సుష్మా మరణ వార్త విని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కరీ, హర్ష వర్ధన్‌ తదితరులు హుటాహుటిన ఎయిమ్స్ కు చేరుకున్నారు.

Related Posts