YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ప్రియుడు కోసం భర్తను చంపేసింది

ప్రియుడు కోసం భర్తను చంపేసింది

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడి సాయంతో చంపేసిందో ఇల్లాలు. ఏమీ ఎరుగనట్లు తన భర్త అనారోగ్యంతో చనిపోయాడంటూ శోకాలు పెట్టింది. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ఇది సహజమరణం కాదని, నిద్రమాతలు మింగడంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతోనే చనిపోయినట్లు తేల్చారు. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిజం తెలుసుకుని అవాక్కయ్యారు. భర్తను పొట్టన పెట్టుకున్న మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మిరా రోడ్‌లో ప్రమోద్ పట్నాకర్ అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నాడు. అతడు స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతడి భార్య దీప్తి పట్నాకర్ ఓ పాఠశాలలో పనిచేస్తుంటుంది. ఆమెకు 2015లో ఉద్ధవ్ పంచాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీప్తి భర్త కళ్లుగప్పి ప్రియుడితో రాసలీలలు సాగించేది. ప్రమోద్ కుటుంబం కోసం కష్టపడుతుంటే ఆమె మాత్రం ప్రియుడి మోజులో పడి భర్తను పట్టించుకోవడం మానేసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రమోద్ ఆరా తీయగా ఆమె వ్యవహారం తెలిసింది. దీంతో భార్యను హెచ్చరించాడు. ఆమె ఈ విషయాన్ని ప్రియుడితో చెప్పడంతో ప్రమోద్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. జులై 15వ తేదీన దీప్తి భర్త తాగే టీలో 20 నిద్రమాత్రలు కలిపింది. దాన్ని తాగగానే ప్రమోద్ అపస్మాకర స్థితిలోకి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అతడికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. దీప్తి ఏమీ ఎరుగనట్లు తన భర్త అనారోగ్యంతో సడెన్‌గా చనిపోయాడని పోలీసులకు

Related Posts