YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుష్మా స్వరాజ్ పార్థీవ‌దేహాంపై త్రివ‌ర్ణ ప‌త‌ాకం

సుష్మా స్వరాజ్ పార్థీవ‌దేహాంపై త్రివ‌ర్ణ ప‌త‌ాకం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్ పార్థీవ‌దేహాంపై త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని ఉంచారు.ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన‌కార్యాల‌యంలో సుష్మాకు వీడ్కోలు ప‌లికారు. సుష్మా కూతురు బాన్సురీ స్వ‌రాజ్‌, భ‌ర్త స్వ‌రాజ్ కౌశ‌ల్ భావోద్వేగానికి లోన‌య్యారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో సుష్మాకు అంత్య‌క్రియ‌లు ఏర్పాటు చేస్తున్న నేప‌థ్యంలో తండ్రీకూతురు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. దుక్కాన్ని దిగ‌మింగుతూనే సుష్మా పార్ధీవ‌దేహానికి ఇద్ద‌రూ సెల్యూట్ చేశారు. అంత‌క‌ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. ఎండీహెచ్ స్పైస్ కంపెనీ మ‌హాశ‌య్ ధ‌ర్మ‌మ్‌పాల్ గులాటీ సుష్మా పార్దీవ‌దేహం వ‌ద్ద బోరును విల‌పించారు. సుష్మా చాలా అర్థ‌వంత‌మైన జీవితాన్ని గడిపార‌ని ద‌లైల‌మా త‌న నివాళిలో పేర్కొన్నారు. ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కూడా సుష్మా మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేసింది. భార‌త్‌, అమెరికా మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతం గురించి సుష్మా ఎంతో కృషి చేసిన‌ట్లు ఎంబ‌సీ అభిప్రాయ‌ప‌డింది.

Related Posts