YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైల్వేల్లో హోస్ట్లు

రైల్వేల్లో హోస్ట్లు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల సౌకర్యం కోసం వినూత్నమైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. విమానంలోని సేవలను ట్రైన్ ప్యాసింజర్లకు అందించాలని భావిస్తోంది. దీని కోసం ఒక పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ స్టీవార్డ్స్ సర్వీసులు అందిస్తోంది. ఏజెన్సీ నివేదిక ప్రకారం చూస్తే.. ఈ పైలెట్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ బాధ్యతలను ఐఆర్‌సీటీసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. 34 మంది ఎయిర్‌ హోస్టెస్ ఫ్లైట్ స్టీవార్డ్స్‌ను వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌లో నియమించింది. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేపథ్యంలో వీళ్లు ఆరు నెలలు ప్యాసింజర్లకు సేవలు అందించనున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. ఇండియన్ రైల్వేస్ ఈ సేవలు ఇతర ప్రీమియం ట్రైన్లలోనూ అందుబాటులోకి తీసుకురావొచ్చు. ఐఆర్‌సీటీసీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. ప్యాసింజర్లకు సుప్రీమ్ సర్వీసులు అందించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రయత్నిస్తోందన్నారు. ట్రైన్‌లో ఎయిర్ హోస్టెస్‌, ఫ్లైట్ స్టీవార్డ్‌లకు నెలకు రూ.25,000 అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ వందేమాతరం ఎక్స్‌ప్రెస్ సేవలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇది న్యూఢిల్లీ-వారణాసి మధ్యలో నడుస్తుంది. చెన్నై‌కు చెందిన రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఈ ట్రైన్‌ను రూపొందించారు. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Related Posts