YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కియా క్రెడిట్ కోసం తహతహ

కియా క్రెడిట్ కోసం తహతహ

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అనంతపురం జిల్లా పెనుగొండ కియా ఫ్యాక్టరీ నుంచి తొలికారు బయటకు రాబోతోంది. గురువారం మేడిన్ ఆంధ్రా సెల్తోస్‌ కారు లాంఛ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకావాల్సి ఉన్నా.. బిజీ షెడ్యూల్‌తో వెళ్లలేకపోతున్నారు. ఇదిలా ఉంటే కియా మోటార్స్ ఏపీకి రావడం తమ ఘనతే అని టీడీపీ చెప్పుకోగా.. కాదు కాదు.. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఈ దిశగా అడుగులు పడ్డాయని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. ‘మాజీ మంత్రి నారా లోకేష్ కారు లాంఛింగ్‌పై ట్వీట్ చేశారు. ఇది ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితం. కియా మోటార్స్ సంస్థని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. నేడు కియా సంస్థ నుండి మొట్టమొదటి మేడ్ ఇన్ ఆంధ్రా కారు విడుదల అవుతున్న సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు’తెలిపారు. హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేశారు. స్వప్నానికి ఫలితం. కియా మోటార్స్ సంస్థని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడానికి @ncbn గారు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. నేడు కియా సంస్థ నుండి మొట్టమొదటి  మేడ్ ఇన్ ఆంధ్రా కారు విడుదల అవుతున్న సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు.ఇటు మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కార్ లాంఛ్‌పై స్పందించారు. కియా మొదటి కారు రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా కియాను అభినందిస్తున్నాను అన్నారు. ఆటో మొబైల్ రంగంలో కియా ఒక నూతన అధ్యాయం తీసుకురావాలన్నారు. కియా సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ పెనుగొండలో రూ.13,500 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల్లో కియా కార్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. కియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017, ఏప్రిల్‌ 27న ఒప్పందం చేసుకుంది. ప్లాంట్‌ నిర్మాణ పనులు 2017 నవంబరు 15న ప్రారంభించింది. 2018, ఫిబ్రవరి 22న సీఎం చంద్రబాబు, కియా మోటార్స్‌ అధ్యక్షుడు పార్క్‌ చేతుల మీదుగా ఫేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు కియా కారును ఆవిష్కరించారు. 2019 జనవరి 29న కియా ముసుగు కప్పిన ట్రయల్ కారులో కంపెనీ ప్రతినిధులు, బాబు కాసేపు షికారు చేశారు.

Related Posts