YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంతెన పై నుంచి కాల్వలో పడిన కారు..!

వంతెన పై నుంచి కాల్వలో పడిన కారు..!

తాడేపల్లిగూడెం, ప.గో.: వంతెన పైనుంచి కారు కాల్వలోకి దూసుకుపోయిన ఘటన తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వంతెన వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నలుగురు హోండా కారులో తుని బయల్దేరారు. మార్గం మధ్యలోని తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో పెద్ద వంతెన దాటి పాత వంతెనను గోడను ఢీకొట్టాడు. కారు పల్టీలు కొట్టుకుం టూ కాల్వలోకి దూసుకుపోయింది. హైదరాబాద్కు చెందిన జి. మహేశ్ తలకు తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడిన మహేశ్ను ను 108లో తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts