నల్గొండ, మఠంపల్లి: నీటి సంపులో పడి విద్యార్థి మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకొంది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లికి చెందిన మహ్మద్ బాబాహుస్సేన్ (19) మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన అనంతరం సంపు వద్దకు వెళ్లి చేతులు కడుక్కొంటుండగా, అతని జేబులోని సెల్ నీటిలో పడిపోవటంతో దాన్ని సంపు నుంచి తీసే క్రమంలో అందులో పడి మృతి చెందాడు. కొద్దిసేపటికి అటుగా వెళ్లిన హుస్సేన్ తల్లి కుమారుడు విగతజీవిగా ఉండడాన్ని చూసి బోరున విలపించింది.