YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మెత్తని ఇడ్లీ ప్రాణం తీసింది..!

మెత్తని ఇడ్లీ ప్రాణం తీసింది..!

సరదాగా జరిగిన ఇడ్లీ తినే పోటీలు విషాదాన్ని మిగిల్చాయి. ఇడ్లీ గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడకపోవడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. తమిళనాడు పుదుకొట్టై కీరమంగళంలోని కళ్లిచ్చియమ్మన్‌లో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఆలయంలో జరిగిన ఇడ్లీలు తినే పోటీల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్థానికంగా ఉండే చిన్న తంబి(44) అనే వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అయితే పోటీలో తానే నెగ్గాలని అతి వేగంగా ఇడ్లీలు తినడం ప్రారంభించాడు. వేగంగా ఇడ్లీలు తింటున్న క్రమంలో ఒక్కసారిగా అతడి గొంతులో ఇడ్లీ అడ్డుపడింది. దాంతో శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Related Posts