బిజు జనతాదళ్ (బిజెడి) రాజ్యసభ అభ్యర్థులుగా పి. ప్రశాంత్ నంద, సౌమ్య రంజన్ పట్నాయక్, అచ్యుత సమంత నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో వారు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.వచ్చే నెలతో బిజెడి నేతలు ఎయు సింగ్డియో, దిలీప్ తిర్కే, బిజెపి మద్దతు గల ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవిస్వామిల రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు అవసరమయ్యాయి. ఈ కార్యక్రమంలో
మంత్రి బిక్రం కేసరీ, తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
.