YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏడు రాష్ట్రాల్లో వరద బీభత్సం

ఏడు రాష్ట్రాల్లో వరద బీభత్సం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దైవభూమి కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలకు మృతిచెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 121కి చేరుకోగా.. గల్లంతయిన వారి సంఖ్య 40కి చేరింది. వరదలకు అత్యధికంగా మలప్పురం జిల్లాలో 50 మంది, కోజికోడ్‌లో 17 మంది, వాయనాడ్‌లో 12 మంది, కన్నూర్, త్రిసూర్‌లో 9 మంది చొప్పున మృత్యువాతపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.13 లక్షల మంది ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.కేరళ వ్యాప్తంగా 805 సహాయక పునరావాస శిబిరాల్లో 41,253 కుటుంబాలకు చెందిన 1,29,517 మంది ఇంకా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వరదలకు మొత్తం 1,186 ఇల్లు పూర్తిగా నెలమట్టమయ్యాయని, 12,761 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. శిధిలాల కింద చిక్కుకున్న వారికోసం రెస్క్యూ టీంలు గాలిస్తున్నారు.  ఇక్కడ జీపీఎస్ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఉత్తర భారతంలో కూడా వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. బియాస్‌, సట్లేజ్‌ నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని యమున నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులంతా సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. త్తరాది రాష్ట్రాలపై వరుణుడు తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆదివారం ఒక్క రోజే కురిసిన కుండపోత వర్షాలకు మూడు రాష్ట్రాల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది ఆచూకీ గల్లంతయ్యింది. కుండపోత వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లు చిగురుటాకులా వణికిపోయాయి. కొండచరియలు విరిగిపడి భారీగా ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. వరద ఉద్ధృతికి వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. పంజాబ్‌లో అతి భారీ వర్షాలు కురువడంతో యమున, సట్లెజ్‌, బియాస్‌ నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. అవోల్‌లో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఇళ్లు, వాహనాలపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. వీటి శిథిలాల కింద చిక్కుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. సిమ్లా, సోలన్‌, కులూ, సిర్మౌర్‌, చాంబా ప్రాంతాల్లో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. సిమ్లా, కులూ, చాంబా జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. బియాస్‌ నది ఉప్పొంగి వరదనీరు మండీ జిల్లా హంగోయి వద్ద చండీగఢ్‌-మనాలీ జాతీయ రహదారిపైకి చేరడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. మూడో నెంబరు జాతీయ రహదారిపై వంతెన కొట్టుకుపోయింది. అటు రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌లో వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో పాటు కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో 25 మంది మృతిచెందగా, 9 మంది గాయాలపాలయ్యారు. ఉత్తరాఖండ్‌లో వరదలకు 8 మంది ఆచూకీ గల్లంతవగా పలు ఇళ్లు కూలిపోయాయి. ఇక యమునా నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో హరియాణాలోని హాతినీ కుండ్‌ బ్యారేజీ నుంచి 8.28 లక్షల క్యూసెక్కుల నీటిని ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. ఈనేపథ్యంలో దిగువన ఉన్న దేశ రాజధాని న్యూఢిల్లీలోని నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు ఉందంటూ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతరూపు దాల్చుతున్నందున అవసరమైతే సైన్యం సహాయాన్ని తీసుకుంటామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరకాశీ జిల్లా మోరీ సమితిలో కుంభవృష్టి వర్షాలకు చాలాచోట్ల ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో 22మంది గల్లంతయ్యారు. వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మరో ముగ్గురు మృతి చెందారు. చార్‌ధామ్‌, కైలాస్‌-మానస సరోవర్‌ మార్గాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

Related Posts