YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

400 కోట్లపైనే చిదంబరం ఆస్తులు

 400 కోట్లపైనే చిదంబరం ఆస్తులు

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

చిదంబరం.. కేంద్ర మాజీ మంత్రి. యూపీఏ హయంలో హోం శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు దేశం మొత్తం ఈయన గురించే మాట్లాడుకుంటోంది. ఈయనను సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం ఇందుకు కారణం. నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అటు సీబీఐ, ఇటు ఈడీ చిదంబరంపై వచ్చిన మనీ లాండరింగ్, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాయి. ఇరు సంస్థలు 2007లో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ సహా ఐదు ఇతర కంపెనీలకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) క్లియరెన్స్‌లో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పాత్రపై కూడా దర్యాప్తు జరుపుతున్నాయి. అప్పుడు చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ నిధులు వచ్చాయని సీబీఐ తన 2017 మే నాటి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈడీ గతేడాది ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి రూ.54 కోట్ల విలువైన కార్తీ చిదంబంరం ఆస్తులను జప్తు చేసింది. ఇప్పుడు సీబీఐ చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుంది. .. పి.చిదంబరం 2014 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఉన్నారు. ఈయన భార్య మద్రాస్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌. వీరి ఇద్దరి ఆస్తి విలువ ఏకంగా రూ.95.66 కోట్లు. అప్పులు రూ.5.79 కోట్లుగా ఉన్నాయి. అప్పుడు రూ.5 లక్షల నగదు ఉంది. 24 బ్యాంకుల్లో రూ.25.73 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి. క్యాష్, డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, షేర్ల విలువ రూ.54.30 కోట్లు. స్థిర ఆస్తుల విలువ రూ.41.35 కోట్లు. ఇక చిదంబరం కుమారుడు కార్తీ ఆస్తులను గమనిస్తే.. 2019 అఫిడవిట్ ప్రకారం.. ఈయన ఆస్తి రూ.79.37 కోట్లు. అప్పులు రూ.17.69 కోట్లు. ఈయనకు క్యాష్, బ్యాంక్ డిపాజిట్లు రూ.7 కోట్లు. చరాస్తుల విలువ రూ.26 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.45.85 కోట్లు. అంటే కుటుంబ ఆస్తి మొత్తంగా దాదాపు రూ.175 కోట్లుగా ఉంది.

Related Posts