YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గతంలో వైఎస్ ని కలిశారు..

Highlights

  • అమిత్‌షాతో కూడా భేటీ అయ్యారు
  • ఇవన్నీ వాస్తవాలు కాదా?
  • హరీష్ రావు పై రేవంత్ ధ్వజం
గతంలో వైఎస్ ని కలిశారు..

తెలంగాణ మంత్రి హరీశ్ రావు పార్టీ మార్పుపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నేతలు పార్టీలు మారుతున్నారంటూ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. గతంలో సదరు నేత కూడా పార్టీ మారడానికి ప్రయత్నాలు జరిపారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో పార్టీ మారడానికి హరీశ్‌రావు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిశారని చెప్పారు. అప్పట్లో దురదుష్టవశాత్తు వైఎస్ పావురాలగుట్టపై వెళ్లి తిరిగి రాకపోవడం వల్ల అయన పార్టీ మార్పు ఆగిపోయిందన్నారు. తాజాగా  మరో ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఇటీవలే  బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో  హరీశ్ రావు  సమావేశం అయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

Related Posts