Highlights
- బాంగ్లాదేశ్ బౌలర్లను బెదరగొట్టిన శ్రీలంక
ముక్కోణపు టీ20 సిరీస్ లో భాగంగా శనివారం శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక 215 పరుగుల లక్ష్యాన్ని బాన్లదేశ్ కు నిర్దేశించింది. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ బౌలర్లను శ్రీలంక బ్యాట్స్ మెన్ కుషల్ మెండీస్ 57, కుషల్ పెరీరా74 , ఉపుల్ తరంగా 32 పరుగులతో బెదరగొట్టారు. మిగతా బ్యాట్స్ మెన్ లో గుణతిలక 26, షనకా 0, చండిమాల్ 2, తిషార పెరీరా 0, జీవన్ మెండీస్ 6 పరుగులు చేశారు.