YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎంపీగా మన్మోహన్ ప్రమాణం

 ఎంపీగా మన్మోహన్  ప్రమాణం

యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   

మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మన్మోహన్ సింగ్ తో  ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌, అహ్మద్ పటేల్ తో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 1991- 2019 మధ్య దాదాపు 3 దశాబ్దాలు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఈ సారి అసోం నుంచి అవకాశం లేకపోవడంతో రాజస్థాన్ నుంచి పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.దాదాపు మూడు దశాబ్దాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ 2004- 14 మధ్య రెండు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. ఈ ఏడాది జూన్ 14తో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ముగిసింది. అసోం నుంచి రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్‌కు సరిపడా బలం లేకపోవడంతో.. ఈ దఫా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. గతేడాది జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక్లలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే

Related Posts