YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మియాపూర్ లో మర్డర్

మియాపూర్ లో మర్డర్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మియాపూర్ ధర్మపురి క్షేత్రం వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకున్న ఓ ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపింది. ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ను వడ్డీ వ్యాపారం చేసే శ్రీకాంత్, ఆయన బామ్మర్ది శ్రీనివాస్.. కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రోజువారీ వడ్డీ వ్యాపారం చేసే శ్రీకాంత్ యాదవ్ ఆటో డ్రైవర్లకు వడ్డీలకు డబ్బులిచ్చి వసూలు చేస్తుంటాడు.ఈ క్రమంలో ప్రవీణ్, రాజేశ్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లకు డబ్బులిచ్చాడు శ్రీకాంత్. ఆ డబ్బును వసూలు చేసేందుకు శ్రీకాంత్ గురువారం రాత్రి బొల్లారం చౌరస్తాకు వెళ్లాడు. డబ్బుల విషయంలో రాజేశ్‌తో శ్రీకాంత్, శ్రీనివాస్ గొడవపడ్డారు. మరో ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ను తీసుకొని ధర్మపురి క్షేత్రం వైపు వెళ్లారు. అయితే అక్కడ ప్రవీణ్‌పై విచక్షణారహితంగా దాడి చేస్తుంటే.. రాజేశ్ భయపడి పారిపోయాడు. ఆ తర్వాత శ్రీకాంత్, శ్రీనివాస్‌పై మియాపూర్ పోలీసులకు రాజేశ్ ఫిర్యాదు చేశాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రవీణ్‌ను హత్య చేసిన శ్రీకాంత్, శ్రీనివాస్.. మొండెం నుంచి తలను వేరు చేశారు. తలను తీసుకెళ్లి బొల్లారంలో పడేశారు. క్లూస్‌టీం తలను స్వాధీనం చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రవీణ్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

Related Posts