YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళనాడులో నరరూప రాక్షసుడికి జీవిత ఖైదు

తమిళనాడులో నరరూప రాక్షసుడికి  జీవిత ఖైదు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తమిళనాడు రాష్ట్రంలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మహిళ, ఆమె ముగ్గురు కూతుళ్ల హత్యకేసులో చెన్నైలోని మహిళా న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. నాలుగు హత్యలకుగాను నాలుగు జీవితఖైదులతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ మహిళా కోర్టు జడ్జి మంజుల తీర్పు చెప్పారు.వివరాల్లోకి వెళ్తే.. చిత్రవీణ అలియాస్ పాండిమ్మళ్(36) అనే మహిళ భర్త, ముగ్గురు కుమార్తెలతో కలిసి తమిళనాడులోని దిండిగుల్ జిల్లా పళనిలో నివాసముండేది. చూడముచ్చటైన ఈ కుటుంబంలోకి చినరాజ్ అనే వ్యక్తి ప్రవేశించడంతో కలతలు మొదలయ్యాయి. చిత్రవీణతో అక్రమ సంబంధం పెట్టుకున్న చినరాజ్ ఆమెను భర్త నుంచి విడదీసి చెన్నైలోని రాయపేటలో సహజీవనం మొదలుపెట్టాడు. చిత్రవీణతో పాటు ఆమె ముగ్గురు కూతుళ్లు పరిమళ్(19), పవిత్ర(18), స్నేహ(16) కూడా అతడి దగ్గరకి వచ్చేశారు. మొదట్లో కొద్దిరోజులు బాగానే ఉన్న చినరాజ్ ప్రియురాలి మూడో కుమార్తె స్నేహపై కన్నేశాడు. దీంతో ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేసేశాడు. ఈ క్రమంలోనే జూన్ 20, 2016 రోజున ప్రియురాలితో తీవ్రంగా గొడవ పడిన చినరాజ్ ఆమెతో పాటు ముగ్గురి కూతుళ్లను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు.
అనంతరం నాలుగు మృతదేహాలతోనూ సెక్స్ చేసి పైశాచికానందం పొందాడు. మూడు రోజులుగా ఇంట్లోని వారెవ్వరు బయటికి రాకపోవడంతో పాటు దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని లోనికి వెళ్లగా తల్లీకూతుళ్లు రక్తపు మడుగులో దుస్తులు లేకుండా విగతజీవులుగా కనిపించారు. ఆ షాక్ నుంచి తేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ నలుగురు చనిపోయిన తర్వాత అత్యాచారానికి గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కావడంతో పోలీసులు చినరాజ్‌ను అరెస్ట్ చేసి పక్కా ఆధారాలతో కోర్టులో హాజరు పరిచారు. దీనిపై మూడేళ్ల పాటు విచారణ కొనసాగించన న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. చినరాజ్‌ను దోషిగా నిర్ధారిస్తూ అతడికి నాలుగు జీవితఖైదులు విధించడంతో పాటు రూ.20వేల జరిమానా విధించింది.

Related Posts