YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ తీరంలో పాక్ కమాండోలు..భారత్ హై అలెర్ట్

గుజరాత్ తీరంలో పాక్ కమాండోలు..భారత్ హై అలెర్ట్

యువ్  న్యూస్ జనరల్ బ్యూరో:

గుజ‌రాత్ తీరంలోకి పాక్ క‌మాండోలు ప్ర‌వేశించనున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. గుజ‌రాత్‌లోని క‌చ్ ప్రాంతం నుంచి వాళ్లు భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించేందుకు లేదా ఉగ్ర‌దాడులు చేసేందుకు పాక్ క‌మాండోలు ప్లానేసిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్‌కు చెందిన అదానీ పోర్టు ఓ హెచ్చ‌రిక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. హ‌రామీ నాలా ప్రాంతం నుంచి గ‌ల్ఫ్ ఆఫ్ క‌చ్‌లోకి పాక్ శిక్షిత క‌మాండోలు ప్ర‌వేశించిన త‌మ‌కు స‌మాచారం అందింద‌ని అదాని పోర్టు పేర్కొన్న‌ది. ముంద్రా పోర్టు వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. గుజ‌రాత్ రాష్ట్రావ్యాప్తంగా కూడా భారీ ప‌టిష్ట‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు.గుజరాత్‌ తీరం వెంట పలు నగరాల్లో దాడులు జరిపి విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇందు కోసం సముద్ర నీటిలో నుంచి భారత భూభాగంపైకి దాడి చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని నియమించినట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యలో భాగంగా ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలను కూడా గుజరాత్ తీరం వెంట సిద్ధంగా ఉంచారు. సరిహద్దు భద్రతా సిబ్బంది, తీర ప్రాంత సిబ్బంది అప్రమత్తమయ్యారు. తీరం వెంబడి భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. గుజరాత్‌లోని అన్ని నౌకాశ్రయాలకు హై అలర్ట్‌ ప్రకటించారు. కాండ్లా పోర్టులో భద్రతను పెంచారు. అటు గోవా తీరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకోవడంతో పాకిస్థాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. సరిహద్దు వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్‌‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts