Highlights
- అందరికీ టిక్కెట్లు
- ఎమ్మెల్యేలు బొడిగె శోభా,
- గంగుల కమలాకర్లపై
- కేసీఆర్ అసహనం
- ముస్లిం రిజర్వేషన్లపై తేల్చుకుంటా
- దిల్లీలో ధర్నా చేస్తా..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ముగ్గురు నలుగురికి తప్ప అందరికీ తిరిగి టిక్కెట్లు ఇస్తానని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నేడు కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బొడిగె శోభా, గంగుల కమలాకర్లపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోవాలని వారికి సూచించారు. శాసన సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 106సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముస్లిం రిజర్వేషన్లపై దిల్లీకి..
శాసనసభ సమావేశాల అనంతరం దిల్లీ వెళతానని కేసీఆర్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశంపై రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతానని పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ ఎంపీలతో కలిసి ధర్నా చేస్తానని చెప్పారు.