YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వారెవరో....ఆ ముగ్గురికి తప్ప..

Highlights

  • అందరికీ టిక్కెట్లు
  • ఎమ్మెల్యేలు బొడిగె శోభా, 
  • గంగుల కమలాకర్‌లపై 
  • కేసీఆర్‌ అసహనం 
  • ముస్లిం రిజర్వేషన్లపై తేల్చుకుంటా
  • దిల్లీలో  ధర్నా చేస్తా..
వారెవరో....ఆ  ముగ్గురికి తప్ప..

తెలంగాణ రాష్ట్రంలో  ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో  ముగ్గురు నలుగురికి తప్ప అందరికీ తిరిగి టిక్కెట్లు ఇస్తానని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. నేడు కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బొడిగె శోభా, గంగుల కమలాకర్‌లపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోవాలని వారికి సూచించారు. శాసన సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 106సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ‌ ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముస్లిం రిజర్వేషన్లపై దిల్లీకి..
శాసనసభ సమావేశాల అనంతరం దిల్లీ వెళతానని కేసీఆర్‌ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశంపై రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతానని పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ ఎంపీలతో కలిసి ధర్నా చేస్తానని చెప్పారు.

Related Posts