YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓఎన్జీసీ గోదాములో అగ్నిప్రమాదం..ఏడుగురు మృతి

ఓఎన్జీసీ గోదాములో అగ్నిప్రమాదం..ఏడుగురు మృతి

ముంబైలోని ప్రభుత్వ రంగ చమురు సంస్ధ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం  ఉదయం ఉరాన్ సమీపంలోని గోడౌన్

లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో శీతల గిడ్డంగిలోని కోట్లాది రూపాయల విలువైన యంత్ర సామగ్రి, ఇతర ఉపకరణాలు, ముడి చమురు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది

ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు, ఆ ప్రాంతం చమురు శుద్ధి కర్మాగారం పరిధిలో ఉండటంతో, తగు జాగ్రత్తలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. దాదాపు

కిలోమీటర్ మేర ప్రజలను తరలించారు.  డ్రైన్ పైపులలో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించివుండవచ్చని, ఘటనపై విచారణను జరుపుతామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు.

ఘటనలో  ఐదు మంది ఓఎన్జీసీ సిబ్బంది, ఇద్దరు అగ్నిమాపక దళ సభ్యులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటనాస్థలం ముంబైకి 45 కిలోమీటర్ల దూరంలో వుంది.

అయితే, ఉత్పత్తి కి పాక్షికంగా అంతరాయం కలిగినట్లు అధికారులు పేర్కోన్నారు

Related Posts