Highlights
- ఇక అమరావతిలోనే నివాసం
- భవిషత్ లో ఇదే పార్టీ కేంద్రం
జనసేన పార్టీ అధినేత, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక నుంచి అమరావతిలోనే ఉండబోతున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. తొలుత హోమం నిర్వహించారు
మురగన్ హోటల్ రోడ్డులోని సాహితీ వెంచర్లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకుని ఓ ప్రైవేటు హోటల్లో పవన్బస చేశారు. అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నాయకులకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. భవిష్యత్తులో దీన్ని పార్టీ కార్యాలయంగానూ వినియోగించుకునే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం.