YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమ్మను కలుసుకోవచ్చు

అమ్మను కలుసుకోవచ్చు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీని క‌లుసుకునేందుకు ఆమె కూతురు ఇతిజా జావెద్‌కు సుప్రీకోర్టు అనుమ‌తినిచ్చింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో క‌శ్మీర్‌లో ప‌లువురు నేత‌ల్ని గృహ‌నిర్బంధం చేసిన విష‌యం తెలిసిందే. శ్రీన‌గ‌ర్‌లో మెహ‌బూబా ముఫ్తీని కూడా హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఆమె కూతురు జావెద్ కోర్టులో పిటిష‌న్ వేశారు. త‌న త‌ల్లిని క‌లుసుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టును వేడుకున్న‌ది. అమ్మ ఆరోగ్యం స‌రిగా లేద‌ని, ఆ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని, అమ్మ‌ను చూసి నెల రోజులు అవుతున్న‌ద‌ని త‌న పిటిష‌న్‌లో జావెద్ పేర్కొన్న‌ది. దీంతో ముఫ్తీని క‌లుసుకునేందుకు కోర్టు ఆమె కూతురుకు అనుమ‌తి ఇచ్చింది. జావెద్ త‌ర‌పున అడ్వ‌కేట్ ఆక‌ర్ష్ క‌మ్రా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సీతారం ఏచూరి త‌ర‌హాలోనే ఇతిజాకు క‌శ్మీర్ వెళ్లే అవ‌కాశం ఇవ్వాల‌న్నారు. క‌శ్మీరీ నేత‌ల‌ను జంతువుల్లా బంధించార‌ని ఇటీవ‌ల ఇతిజా ఓ వీడియో సందేశంలో ఆరోపించిన విష‌యం తెలిసిందే.

Related Posts