YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్యాసింజర్ ట్రైన్ల చార్జీలు తగ్గింపు

ప్యాసింజర్ ట్రైన్ల చార్జీలు తగ్గింపు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మీరు తరచుగా రైల్వే ప్రయాణం చేస్తూ ఉంటారా? అయితే మీకు తీపికబురు. సర్వీస్ చార్జీలను మళ్లీ విధిస్తూ ప్యాసింజర్లకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ ఇప్పుడు వారికి ఒక గుడ్ న్యూస్ అందించింది. ఇ-టికెట్ బుకింగ్స్‌పై కన్వీనియన్స్ ఫీజును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఐఆర్‌సీటీసీ ఇకపై నాన్ ఏసీ కోచ్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌పై రూ.15 ఫీజు వసూలు చేయనుంది. అదే ఏసీ క్లాస్ టికెట్, ఫస్ట్ క్లాస్ టికెట్ బుకింగ్‌పై ఈ చార్జ్ రూ.30గా ఉంది. ఇదివరకటి చార్జీలతో పోలిస్తే ఇప్పుడు ఐఆర్‌సీటీసీ 25 శాతం తక్కువ ఫీజును వసూలు చేస్తోంది.ఇదివరకు నాన్ ఏసీ క్లాస్ టికెట్‌పై సర్వీస్ చార్జ్ రూ.20గా ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్‌పై చార్జీ ఏకంగా రూ.40. ఐఆర్‌సీటీసీ భీమ్, యూపీఐ మార్గంలో టికెట్లను బుకింగ్ చేసుకునే వారికి కూడా తీపికబురు అందించింది. యూపీఐ, భీమ్ యాప్స్ ద్వారా నాన్ ఏసీ క్లాస్ టికెట్ బుకింగ్‌ చేసుకుంటే ఇకపై కేవలం రూ.10, ఏసీ అండ్ ఫస్ట్ క్లాస్ టికెట్ బుకింగ్‌ చేసుకుంటే రూ.20 ఫీజు మాత్రమే వసూలు చేయనుంది. నవంబర్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది.ఇకపోతే ఐఆర్‌సీటీసీ సెప్టెంబర్ 1 నుంచి తన ప్లాట్‌ఫామ్ ద్వారా చేసుకునే టికెట్ బుకింగ్స్‌పై సర్వీస్ చార్జీని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు సంస్థ గతంలో ఈ చార్జీలను ఎత్తివేసింది. అయితే ఆదాయం తగ్గడంతో మళ్లీ సర్వీస్ చార్జీని వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటికే ట్రైన్ టికెట్ ధరలు పెరిగాయి.

Related Posts