Highlights
- నిన్ననే దాడికి దిగాలని ప్రణాళిక
- కోమటిరెడ్డి హత్యాయత్నం
- వీడియో సాక్ష్యం
- తీవ్రంగా పరిగణిస్తాం
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుకొట్టి వచ్చారని, అసెంబ్లీలో గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్ లపై ఓ పధకం ప్రకారం దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది. మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యాయత్నం చేశారని, దీనికి వీడీయో ఫుటేజ్ సాక్ష్యం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. సభలో కాగితాలు చింపి నిరసన తెలపడం సాధారణమేనని, అయితే, అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేసుకుని ఆసుపత్రి పాలు చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఓ పెన్ను తీసుకుని విసిరేసినా అది కణతకు తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని, కన్నుకు తగిలితే చూపు పోతుందని ఆయన అన్నారు. గురిచూసి స్వామిగౌడ్ ను కోమటిరెడ్డి కొట్టారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా దాడి చేస్తారని తాము ముందుగానే ఊహించామని జీవన్ రెడ్డి చెప్పారు.