YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

 మళ్లీ తెగపడుతున్న పాకిస్తాన్

 మళ్లీ తెగపడుతున్న పాకిస్తాన్

మళ్లీ తెగపడుతున్న పాకిస్తాన్
శ్రీనగర్, సెప్టెంబర్ 9
కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్రం రద్దుచేయడంతో కాలుగాలిన పిల్లి మాదిరి పాకిస్థాన్ మిడిసిపడుతోంది. కశ్మీరీల హక్కుల కోసం అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనుకాడబోమని ప్రగల్భాలు పలుకుతోంది. ఇదే సమయంలో ఉగ్రవాదులను లోయలోకి పంపి మారణహోమాన్ని సృష్టించడానికి విఫలప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దుల్లో కవ్వింపు  చర్యలకు పాల్పడుతూ భారత సైనిక పోస్టులకు కాల్పులకు తెగబడుతోంది. తాజాగా కశ్మీర్‌లో అలజడలకు పాక్ పెద్ద పన్నాగమే చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా   షే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌ను రహస్యంగా విడుదల చేసినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఒత్తిడి ఎదురుకావడంతో కొద్ది రోజుల కిందట జైషే మహమ్మద్‌ ఉగ్రవాది  మసూద్‌ను అరెస్టు చేసినట్లు దాయాది పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే.తమ భూభాగంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నట్లు నటిస్తూనే కొత్త ఎత్తుగడకు మొదలెట్టింది. ఉగ్రవాదం విషయంలో   మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది. మసూద్‌ అజార్‌ను పాక్‌ రహస్యంగా విడుదల చేసినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఐబీ వర్గాలు అప్రమత్తం చేశాయి. రాజస్థాన్‌  సమీపంలో ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద పాక్‌ పావులు కదుపుతోందని ఐబీ వర్గాలు వెల్లడించాయి.ఐబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సియాల్‌కోట్- జమ్మూ, రాజస్థాన్‌ సరిహద్దుల్లో  
పెద్ద కుట్రకు పాక్‌ తెరతీసినట్టు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో తీవ్రంగా రగలిపోతున్న పాక్.. రాజస్థాన్‌ సరిహద్దుల్లో భారీ స్థాయిలో ఆర్మీని  మోహరించినట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. భారత్‌కు ధీటైన సమాధానం ఇస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ  నేపథ్యంలో జైషే అధినేత మసూద్‌ అజార్‌ను రహస్యంగా విడుదల చేసినట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలకు దిశానిర్దేశం చేయడానికే అజార్‌ను విడుదల చేసినట్టు ఐబీ తెలిపింది.కశ్మీర్‌లో విషయంలో ఎంతటికైనా వెళ్తామని, దీని పర్యవసానాలకు అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ బెదిరింపులకు పాల్పడగా, గతవారం పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా ఇలాంటి   వ్యాఖ్యలే చేశారు. కశ్మీరీ సోదరుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోమని, తమ చివరి శ్వాసవరకూ పోరాడుతామని వ్యాఖ్యానించాడు.

Related Posts