YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ భాధితులకు అండగా రేపు "చలో ఆత్మకూరు" కు తరలిరండి అనంత మాజీ మేయర్ పిలుపు

వైసీపీ భాధితులకు అండగా రేపు "చలో ఆత్మకూరు" కు తరలిరండి అనంత మాజీ మేయర్ పిలుపు

వైసీపీ భాధితులకు అండగా రేపు "చలో ఆత్మకూరు" కు తరలిరండి
అనంత మాజీ మేయర్ పిలుపు
అనంతపురం సెప్టెంబర్ 10
వైసీపీ ఆరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన "చలో ఆత్మకూరు" కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాలోని టీడీపీ శ్రేణులు, వైసీపీ భాధితులు భారీగా తరలిరావాలని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ మదమంచి స్వరూప పిలుపునిచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలను ఊళ్ళ నుంచి తరిమేసి వందరోజులు దాటిపోయిందని, భూముల నుంచి వెళ్లగొట్టి మూడున్నర నెలలైందని, 500పైగా కుటుంబాలు పరాయి గ్రామాల్లో తలదాచుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా అధినేత చేస్తున్న కార్యక్రమానికి తెలుగుదేశం శ్రేణులు ప్రతిఒక్కరూ సంఘీభావం తెలియజేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితులకు అండగా తెదేపా కార్యకర్తలు భారీగా గుంటూరుకు కదలిరావలని ఆమె పిలుపునిచ్చారు.

Related Posts