YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

బాంబుల్లా పేలిన టీవీలు, ఫ్రిడ్జిలు..

Highlights

  • ఓ బీటెక్ విద్యార్థి బలి 
  • ఇళ్లకు ఒక్కసారిగా 11కేవీ సప్లయ్
  •  పేలిన టీవీలు, ఫ్రిడ్జిలు..
  • మొబైల్ ఛార్జింగ్ పెడుతున్న 
  • బీటెక్ విద్యార్థి షార్ట్ సర్క్యూట్ తో మృతి 
  • బాధితుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం, 
  • దర్యాప్తుకు ఆదేశం
బాంబుల్లా  పేలిన టీవీలు, ఫ్రిడ్జిలు..

మీరట్‌లోని ఇంచోలీ కువాన్ పట్టి ప్రాంతంలో టీవీలు, ఫ్రిడ్జిలు ఒకటి తర్వాత మరోటి బాంబుల్లా పేలిపోయాయి. ఒకదాని తర్వాత మరోకటి  బాంబుల్లా పేలడంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ముగ్గురు మహిళలు సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఓ ఇల్లు మంటలకు ఆహుతైంది.అంతే కాకుండా  20 ఏళ్ల బీటెక్ విద్యార్థి కూడా మృత్యువాత పడ్డాడు. తన మొబైల్ కు ఛార్జింగ్ పెడుతున్న తరుణంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఈ దుర్ఘటన జరింగింది. ఆయా ప్రాంతాల్లోని  దాదాపు 110 ఇళ్లకు ఉన్నట్లుండి 11కేవీ విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనితో  కోపోద్రిక్తులైన సదరు గ్రామస్థులు తమకు సమీపంలోని 119 నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారుల్ని వారించే ప్రయత్నం చేశారు.మరోవైపు విద్యుత్ శాఖ బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం కింద రూ.5 లక్షల చెక్కును అందజేసింది. సతేంద్ర దాస్ అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి తన మొబైల్ ఫోనుకు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తన ఇంటికి హఠాత్తుగా హైఓల్టేజీ సప్లయ్ కావడంతో విద్యుత్ షాకుతో అతను మరణించాడని ఎస్‌పీ (రూరల్) రాజేశ్ కుమార్ తెలిపారు. మరోవైపు టీవీ పేలడంతో దాని నుంచి ఎగసిన మంటలకు షాతీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇల్లు తగలబడి పోయిందన ఆయన చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియడం లేదని పశ్చిమంచల్ విద్యుత్ వితరన్ నిగమ్ లిమిటెడ్ (పీవీవీఎన్‌ఎల్) చీఫ్ ఇంజనీరు ఎస్‌బీ యాదవ్ తెలిపారు.

Related Posts