YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
 ఏపీ డీజీపీకి నోటీసులు 
గుంటూరు  సెప్టెంబర్ 13 
గుంటూరు జిల్లా  అనంతవరం గ్రామంలో తాడికొండ వైసీపీ  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటమే కాకుండా జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించారు.వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో కొందరు టిడిపి నేతలు దూషించటం,ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టటం పెద్ద చర్చకు కారణం అయ్యింది. తనను అవమానించిన వారిపై న్యాయపోరాటానికి సిద్ధం అయిన శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదుతో అప్పట్లో టీడీపీ నేతలు కొమ్మినేని శివయ్య, కొమ్మినేని సాయి, కొమ్మినేని రామకృష్ణ, కొమ్మినేని బుజ్జిలపై తుళ్లూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించారు.అనంతవరంలో వినాయక మండపానికి వెళ్లిన తనపై కొందరు కుల, లింగ వివక్ష వ్యాఖ్యలు చేశారని శ్రీదేవి జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నోటీసులు జారీచేసింది.ఇక ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో తమకు నివేదికను అందించాలని సవాంగ్ కు జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Related Posts