YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఉమాకు విజయసాయి వార్నింగ్

ఉమాకు విజయసాయి వార్నింగ్

ఉమాకు విజయసాయి వార్నింగ్
విజయవాడ, సెప్టెంబర్ 14,
సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలపై విరుచుకుపడే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ చేశారు. రివర్స్ టెండర్లు, జ్యుడీషియల్ కమిషన్‌పై ఉమా చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. తాము ప్రజలకు జవాబుదారులం కానీ పచ్చదొంగలకు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకుతిన్నారని విజయసాయి ఆరోపించారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్లతో టీడీపీ నేతల దోపిడీని వెలికితీస్తామన్నారు. అన్నీ బయటపడతాయని, కొద్దిరోజులు ఓపిక పట్టాలంటూ దేవినేని ఉమాపై సెటైర్లు వేశారు.సరిగ్గా నాలుగేళ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని విజయసాయి అన్నారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారులుగా ఉంటామని స్పష్టం చేశారు.పోలవరం టెండర్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని కాపాడేందుకే రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నట్లు జగన్ సర్కార్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిని అరికట్టేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిషన్ విచారించిన తరువాతే టెండర్లను ఖరారు చేసేలా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Related Posts