YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వైకాపాపై దుష్ప్రచారం

వైకాపాపై దుష్ప్రచారం

వైకాపాపై దుష్ప్రచారం
తిరుమల సెప్టెంబర్ 14,
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు.విఐపీ విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయ పూజారులు అందించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి  పరిపాలనలో రాష్ట్రంలో ప్రశాంతం నెలకొని కృష్ణ గోదావరి జలాలతో సుభిక్షంగా కళకళలాడుతోందని చెప్పారు. రైతు భరోసా వచ్చే నెల నుంచి 12,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజాదారణ పొందుతున్న  వైసీపీపై తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి పుష్కరాలు లో 30 మంది ప్రజలు చనిపోయిన విషయాన్ని ప్రజలందరు మరచి పోలేదని చెప్పారు. చంద్రబాబు ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలాడిస్తున్నారన్నారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని... పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కోడెల, యరపతినేని, దేవినేని ఉమా, అచ్చెన్న, బోండా బాధితుల కోసం  చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు.

Related Posts