YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సంగాల చెరువుకు నీళ్లు  విడుదల చేసిన గద్వాల ఎమ్మెల్యే 

సంగాల చెరువుకు నీళ్లు  విడుదల చేసిన గద్వాల ఎమ్మెల్యే 

సంగాల చెరువుకు నీళ్లు  విడుదల చేసిన గద్వాల ఎమ్మెల్యే 
జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 16,
రోజు ర్యాలంపాడు రిజర్వాయర్ నుండి గొలుసుకట్టు చెరువుల ద్వారా సంఘాల రిజర్వాయర్ కు   నీళ్లు రావడం తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  అక్కడ  ప్రత్యేక పూజలు చేసి సంగాల చెరువుకు నీటిని విడుదల చేసారు. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రతి ఒక రైతుకి నీళ్లు  అందజేసి ఏడాది ప్రతి ఒక్కరూ రైతులు రెండు పంటలకు నీళ్లు అదేవిధంగా కృషి చేస్తామని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈ సంగాల చెరువు క్రింద 1000 ఏకరాలకు పంటపొలాలకు సాగునీరు అందుతుంది. రైతులు సమన్వయంతో సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతి రోజు రిజర్వాయర్ నీళ్లు నింపే విషయాలను తెలుసుకుంటున్నారు. సంగాల చెరువు నీళ్లు విడుదల  చేయడం వల్ల మల్దకల్, ధరూర్ మండలం లోని రైతులకు,  గద్వాల పట్టణంలో ప్రజలకు  గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అన్నారు.  ఈ  కార్యక్రమంలో మల్దకల్ మండలం   ఎంపీపీ,రాజారెడ్డి 
జడ్పిటిసి సభ్యులు  ప్రభాకర్ రెడ్డి తెరాస పార్టీ నాయకులు ధరూర్ నరసింహా రెడ్డి, అజయ్ ధర్మ రెడ్డి, గోవిందు,   సత్యం రెడ్డి సురేంద్ర రెడ్డి  , నాయకులు కార్యకర్తలు  రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts