YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కోడెలను వేధించి చంపారు :టీడీపీ నేతలు

కోడెలను వేధించి చంపారు :టీడీపీ నేతలు

కోడెలను వేధించి చంపారు :టీడీపీ నేతలు
గుంటూరు, సెప్టెంబర్ 16, 
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వెంటాడి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్షసాధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. పలు కేసుల్లె కోడెలకు బెయిల్ వచ్చినా కొత్త కేసులు పెట్టి వేధించారన్నారు. టీడీపీ నేతలను జగన్ సర్కార్ వెంటాడుతోందని, ఇలాగే కొనసాగితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నిబద్ధత కలిగిన నేతను కోల్పోయామని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు.టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ప్రభుత్వమే కేసుల పేరుతో వేధించి హత్య చేసిందని మండిపడ్డారు. కోడెలది ముమ్మాటికీ రాకీయ హత్యేనని స్పష్టం చేశారు. కోడెల లాంటి ధైర్యశాలి ఆత్మహత్య చేసుకున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందన్నారు.ప్రజా సేవ కోసం పరితపించిన వ్యక్తి కోడల అని, వ్యక్తిగతంగా ఒక స్నేహితుడిని కోల్పోయానని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కోడెలది రాజకీయ హత్యగా ఆయన అభివర్ణించారు. కోడెల మృతి పట్ల టీడీపీ సీనియర్ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related Posts