YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

స్కూల్ బస్ బోల్తాపై మంత్రి సీరియస్

స్కూల్ బస్ బోల్తాపై మంత్రి సీరియస్

స్కూల్ బస్ బోల్తాపై మంత్రి సీరియస్
దర్శి సెప్టెంబర్ 19 
ప్రకాశం జిల్లా దర్శి-తూర్పు వీరాయపాలెం మధ్యలో అదుపు తప్పి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను దర్శి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బస్సు  బోల్తా ఘటనపై మంత్రి పేర్నినాని సీరియస్ అయ్యారు. ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రవాణాశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. గాయపడ్డ పిల్లల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ బస్లకు ఫిట్నెస్ లేకపోవడం, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..

Related Posts