YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

24న సీఎంల భేటీ

24న సీఎంల భేటీ

24న సీఎంల భేటీ
హైద్రాబాద్, సెప్టెంబర్ 20 
లుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24న ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు.. హైదరాబాద్‌లో భేటీకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అలాగే విభజన సమస్యలపైనా సీఎంల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రులు.. తాజాగా నదుల అనుసంధానంపై చర్చించనున్నారు.ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరుగు, పొరుగు రాష్ట్రాలుగా స్నేహాపూర్వకంగా ముందుకు సాగుతామన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. విభజన సమస్యలతో పాటూ ఇరిగేష్ ప్రాజెక్టులు, నీట పంపకాలపై చర్చించారు. తాజాగా మరోసారి సమావేశమైన నదుల అనుసంధానంపై చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ పలువురు మంత్రులు, అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు.

Related Posts