YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జీవన్ రెడ్డివి అబద్దాలు : తెరాస ఎమ్మెల్యేలు

జీవన్ రెడ్డివి అబద్దాలు : తెరాస ఎమ్మెల్యేలు

జీవన్ రెడ్డివి అబద్దాలు : తెరాస ఎమ్మెల్యేలు
హైదరాబాద్ 
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను దేశమంతా మెచ్చుకుంటుంటే జీవన్ రెడ్డి మాత్రం  ఎకరానికి కూడా నీళ్లు రాలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద 139మెగావాట్ల సామర్థ్యం గల గాయత్రి పంపు హౌస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోనే ఉన్నది. ఇది చూసి ఓర్వలేక జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ విమర్శించారు. శుక్రవారం అయన అసెంబ్లీ మీడియా పాయింట్ లొ మాట్లాడారు. వరద కాలువను ఒక జీవనది లాగా మలచిన ఘనత కేసీఆర్ ది. జీవన్ రెడ్డి గారు,  మా నియోజకవర్గ రండి నేను దగ్గరుండి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ని చూపిస్తా. ప్రజలు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసినా ఇంకా మీరు అలాగే మాట్లాడుతున్నారని అన్నారు.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి. వరద కాలువలో నీళ్లు ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరిగి లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. అబద్దాలు చెప్పగా చెప్పగా ప్రజలు నమ్ముతారని జీవన్ రెడ్డి భవిస్తున్నట్టున్నాడు. ఎస్ ఆర్ ఎస్ పీ ప్రాజెక్టు పునరుజ్జీవ దిశగా కేసీఆర్ కృషి అమోఘం. జీవన్ రెడ్డి గారు అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయకండని అన్నారు.

Related Posts