YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పేపర్ లీకేజీ అవాస్తవం : మంత్రి రాంచంద్రారెడ్డి

పేపర్ లీకేజీ అవాస్తవం : మంత్రి రాంచంద్రారెడ్డి

పేపర్ లీకేజీ అవాస్తవం : మంత్రి రాంచంద్రారెడ్డి
విజయవాడ, 
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆ వార్తలు వాస్తవం కాదని ఖండించారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగానే పరీక్షలు నిర్వహించిందని.. క్వశ్చన్ పేపర్ లీకేజీకి ఆస్కారమే లేదని మంత్రి అన్నారు.ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పరీక్షల నిర్వహణను అన్ని మీడియా సంస్థలు ప్రశంసించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు.పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాప్రతాలు బయటకు వచ్చే అవకాశమే లేదని వెల్లడించారు. అవాస్తవాలను నమ్మి అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావద్దని మంత్రి సూచించారు.సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ఆంధ్రజ్యోతి అనుమానాలు వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ టైప్ చేసిన ఉద్యోగి పరీక్ష రాసి టాపర్‌గా నిలిచాడని, ఎగ్జామ్ టాపర్లలో ఏపీపీఎస్సీలో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులు ఉన్నారని వివరాలతో సహా ఆంధ్రజ్యోతి పత్రిక కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.సచివాలయ పరీక్షలో లీకేజీ వార్తలతో విద్యార్థి సంఘాలు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు

Related Posts