YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఐటీఐఆర్ పై  అసెంబ్లీలో రగడ.. భట్టి వర్సెస్ కేటీఆర్ వాగ్యుద్ధం 

ఐటీఐఆర్ పై  అసెంబ్లీలో రగడ.. భట్టి వర్సెస్ కేటీఆర్ వాగ్యుద్ధం 

ఐటీఐఆర్ పై  అసెంబ్లీలో రగడ.. భట్టి వర్సెస్ కేటీఆర్ వాగ్యుద్ధం 
హైదరాబాద్
ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ ఒక్కసారిగా హీటెక్కింది. ఐటీఐఆర్పై అధికార-ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్-ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలనే యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు జరిపిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రాజెక్టును సాధించలేదని నిలదీశారు. ఐటీఐఆర్ ద్వారా మొత్తం 70 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం పై పోరాటం చేయాలని సూచించారు. అలాగే అసెంబ్లీలో కూడా ఐటీఐఆర్ కోసం తీర్మానం  చేయాలని విజ్ఞప్తి చేశారు
భట్టి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ఐటీఐఆర్ విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. యూపీఏ ప్రభుత్వం 2013లో బెంగుళూరు, హైదరాబాద్లో ఐటీఐఆర్ అనుమతి ఇచ్చిందన్నారు. కానీ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. అయినా ఆఫీసు స్పేస్ ఆక్యుపెషన్లో బెంగళూరును
హైదరాబాద్ దాటిందన్నారు. ఢిల్లీ పెద్దలు ఉద్ధరిస్తారని తాము చూడట్లేదన్నారు. మా పని మేము చేసుకుని పోతున్నామన్నారు. ఐటీఐఆర్ కోసం కాంగ్రెసోళ్లేదో ఉద్ధరించినట్లు...తామేదో నాశనం చేసినట్టు మాట్లాడం సరికాదని అన్నారు.  ఐటీఐఆర్ విషయంలో యూపీఏ ఒక కాగితం పారేసి పోయిందని  విమర్శించారు.

Related Posts