YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పసికందు కిడ్నాప్…నిందితులు ఆరెస్టు

పసికందు కిడ్నాప్…నిందితులు ఆరెస్టు

పసికందు కిడ్నాప్…నిందితులు ఆరెస్టు
యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 నెలల పసికందు పూజ కిడ్నాప్ కేసు ను జిల్లా పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి వివరాలు  యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి నారాయణ రెడ్డి మీడియా కు వెల్లడించారు. నిందితులు బీబీనగర్ కి చెందిన గుజ్జర రాజు, పిట్టల మాధవి బీబీనగర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిత్తు కాగితాలు, స్క్టాప్ ఎరుకొని జీవనం సాగిస్తున్నారు.  హైద్రాబాద్, ఎల్ బి నగర్ లో నివసించే ఓ మహిళ భర్త తో గొడవపడి పాప తో సహా బీబీనగర్ రైల్వే స్టేషన్ వద్ద కు వద్దకు చేరుకోగా, సదరు మహిళకు నిందితులు రాజు, మాధవి మాయమాటలు చెప్పి వారింటి తీసుకెళ్లారు. తనకు మూడు రోజులు మద్యం తాగించి నిందితులిద్దరు పాప తో సహ ని హైదరాబాద్ వెళ్లిపోయారు. పాప తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక పోలీసుల టీం  గాలింపు తో నిందితులిద్దరినీ సోమవారం  ఉదయం పట్టుకున్నారు. 20 రోజుల తరువాత పాప ను క్షేమంగా తల్లి వద్ద కు  జిల్లా పోలీసులు చేర్చారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను డిసిపి నారాయణ రెడ్డి అభినందించారు.

Related Posts