YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టెండరింగ్ లో పారదర్శకతే లక్ష్యం

టెండరింగ్ లో పారదర్శకతే లక్ష్యం

తాడేపల్లి  రివర్స్ టెండరింగ్ ఓ సాహాసోపేత నిర్ణయం.రివర్స్ టెండరింగ్ ను ప్రవేశపెట్టిన ఘనత  వైయస్ జగన్ దే. 4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్ 4,359 కోట్లకు వచ్చింది. రివర్స్ టెండరింగ్ ద్వారా
రాష్ట్రానికి వేల కోట్లు ఆదా చేస్తూ పారదర్శకంగా వెళ్తుంటే తమ దోపిడీ బండారం బయటపడిపోతుంది అని టిడిపి నేతలు బయపడుతున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖమంత్రి  అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ఒక చరిత్ర.దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పోలవరం హెడ్ వర్క్స్ కు సంబంధించి రివర్స్ టెండరింగ్ లో 800 కోట్ల ప్రజాధనం ఆదాఅయింది. ఇది సామాన్య విషయం కాదని అన్నారు. అందుకే టిడిపి, చంద్రబాబు,  వైయస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. మేఘా 12.6 శాతం తక్కువకు పనులు చేస్తామని ముందుకు వస్తే దానిపై కూడా నానా యాగి చేస్తున్నారు. ఇదే మేఘా సంస్దకు మీ హయాంలో 20 వేల కోట్లమేర కాంట్రాక్ట్ లు ఇచ్చారు.నాణ్యతపై విమర్శలు చేస్తున్నారు.ఇంత ప్రముఖ సంస్ద నాణ్యత పాటించదని చెప్పడం సరికాదు. పారదర్శక బిడ్డింగ్ పై విమర్శలు సరికాదు. పోలవరం ఆగిపోయింది,నష్టం వచ్చిందని రకరకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు. వీటన్నింటిని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంను మీరు చెప్పిందానికన్నా ముందే మేం పూర్తి చేస్తే రాజకీయసన్యాసం తీసుకుంటారా ? మీ పార్టీని (టిడిపిని)పూర్తిగా మూసివేస్తారా అని ప్రశ్నించారు. పోలవరమే కాదు వెలిగొండకు కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం. మీరు ఇచ్చిన ప్రతి పని గురించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం.వేల కోట్ల రూపాయలు ఆదా దిశగా ముందుకు వెళ్తాం. మీరు ఎక్సెస్ ఇచ్చిన టెండర్ల ద్వారా దోపిడీ చేసిన మొత్తం పెదబాబు లేదా చినబాబు జేబులోకి వెళ్లాయా?మరెవరిజేబుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వానికి అవసరమైనవారికి కట్టబెట్టారని విమర్శిస్తున్నారు.10 నుంచి 20 శాతం వరకు లెస్ కు టెండర్ వేస్తే వాటిని కట్టబెట్టడం అంటారా అని నిలదీసారు. మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న స్దలం కూడా సంవత్సరానికి వేయి రూపాయలకు లీజుకు తీసుకున్నారు.ఇంకా మీరు నీతి నిజాయితీ అని మాట్లాడతారా? –మీకు సిగ్గుంటే ఆ స్దలాన్ని ఖాళీ చేసి మాట్లాడండి. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పై జగన్ మోహన్ రెడ్డి దాడి చేస్తున్నారంటావా? –మీరు ఇచ్చిన టెండర్లన్నీ ఎక్సెసే.మేం లెస్ కు టెండర్లు ఇస్తున్నామని అన్నారు. దీనివల్ల 830 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంది.రివర్స్ టెండరింగ్ కు వెళ్లకపోతే ఇన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు ఆయన వందిమాగధుల చేతిలోకి వెళ్లిఉండేవి. నవయుగవాళ్లు కావాలనుకుంట బిడ్ లో పాల్గొనవచ్చుకదా మేం వద్దనలేదే. వాళ్లు నామినేషన్ లో అయితే ముందుకు వస్తారు.కాని బిడ్డింగ్ లో అయితే పాల్గొనరు.  వైయస్ జగన్  ప్రభుత్వం ఇది.  భారతదేశంలోనే ఒక చరిత్ర. వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగులుస్తున్నారు.ఇదే రీతిలో అన్ని ప్రాజెక్ట్ లలో ముందుకు వెళ్తాం. రెండు సంవత్సరాలలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. చంద్రబాబు, టిడిపి ఎల్లోమీడియా విషప్రచారాలను నమ్మవద్దు. టెండరింగ్ లో పారదర్శకతే మా ప్రభుత్వం లక్ష్యమని మంత్రి అన్నారు.

Related Posts