YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఎక్కడ చూసిన జ్వరపీడుతులే...

ఎక్కడ చూసిన జ్వరపీడుతులే...

అదిలాబాద్,  ఆదిలాబాద్‌జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. ఏ ఊరిలో చూసినా జ్వరపీడితులే మంచంపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండడమే దీనికి కారణం. రిమ్స్‌లో రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారుచిన్నా పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాలు, చికున్‌గున్యా, ఇతర జ్వరాలతో వణికిపోతున్నారు. వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదే అదునుగా తీసుకొని ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరం లేకున్నా అన్ని పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు లబోదిబోమంటున్నారు. సరైన వైద్యం అందడంలేదనే కారణంతో ఎక్కువమంది వైద్య చికిత్సల కోసం మహారాష్ట్రలోని యావత్‌మాల్, నాగ్‌పూర్, తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, తదితర మండలాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరల్‌ జ్వరాలు సోకడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రిమ్స్‌ ఆస్పత్రిలో పడకలన్ని నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు ముగ్గురేసి రోగులకు వైద్య చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. వైద్య, ఆరోగ్య శాఖ వ్యాధులను అరికట్టాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జ్వరాలు అదుపులోకి రావడం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని, దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు.జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20,289 మందికి వైరల్, ఇతర జ్వరాలు, ఐదుగురికి మలేరియా జ్వరాలు, 140 మందికి డెంగీ జ్వరాలు సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు లెక్కలు చూపుతున్నారు. అధికారుల లెక్కలకు రెట్టింపుగా జ్వరపీడితుల సంఖ్య ఉందని తెలుస్తోంది. రిమ్స్‌ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో దాదాపు వంద మందికి పైగా డెంగీ జ్వరంతో చేరారు. ఇతర జ్వరాలతో కూడా పిల్లల వార్డు కిక్కిరిసిపోయింది. ఆదిలాబాద్‌ పట్టణంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మిషన్‌ భగీరథ గుంతల్లో ఇటీవల కురిసిన వర్షపునీరు చేరడం, దోమలు వృద్ధి కావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Related Posts