YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

దీన్ దయాల్ జయంతి

దీన్ దయాల్ జయంతి

హైదరాబాద్, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాల్ జయంతి  కార్యక్రమం సికింద్రాబాద్ రసూల్ పుర లో జరిగింది.    వల్లభాయ్ పటేల్ విగ్రహానికి , దీన్ దయాల్ చిత్ర పటానికి పూలమాల  వేసిన నేతలు  స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఇరత పార్టీ నేతలు హజరయ్యారు. రాంచందర్
రావు మాట్లాడుతూ .తెలంగాణ రాష్ట్రములో డెంగ్యూ, స్వైన్ ఫ్లూ  విషజ్వరాలు ప్రబలుతున్నాయని, ఇవి రాకుండ ఉండాలంటే పరిసరాల శుభ్రత తో పాటు, ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని కోరారు.
ప్లాస్టిక్ వాడటం వలనే  వర్షం నీరు నాలా ల లో ఎక్కడికి అక్కడ ఆగిపోవడంతో విషజ్వరాల తీవ్రత పెరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ్ భారత్  
పిలుపు ను నిర్విరామం గా కొనసాగించాలని సూచించారు.

Related Posts