YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ధోనీని క్రాస్ చేసిన రైనా

Highlights

  • టీ-20 ల్లో 1452 పరుగులకు చేరిన రైనా  
  • అగ్రస్థానాల్లో కోహ్లీ (1983 పరుగులు),
  • రోహిత్ (1696 పరుగులు)
  • బుధవారం బంగ్లాతో టీమిండియా 
ధోనీని క్రాస్ చేసిన రైనా

సుదీర్ఘ విరామానంతరం  టీ-20 ముక్కోణపు సిరీస్‌ ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్న సురేశ్ రైనా ఓ అరుదైన ఘనత సాధించాడు.  శ్రీలంకలో జరుగుతున్నఈ మ్యాచ్ లో అంతర్జాతీయ టీ-20ల్లో భారత్ తరపున అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీని అతను పక్కకు నెట్టేశాడు. ధోనీ ఇప్పటివరకు 1444 పరుగులు చేశాడు. అయితే సోమవారం  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులతో  1452 పరుగులకు చేరిన రైనా  ధోనీని మించిపోయాడు. విరాట్ కోహ్లీ (1983), రోహిత్ శర్మ (1696) స్కోర్లతో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో ధోనీ, రైనా చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) తరపున ఆడనున్న సంగతి తెలిసిందే.  ఇక లంక ముక్కోణపు టోర్నీ విషయానికొస్తే...ఇప్పటికే రెండు గెలుపులతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ బుధవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Related Posts