Highlights
- ప్రతీకార దాడులకు తెగబడ్డ మావోయిస్టులు
- ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి
- గాయపడిన జవాన్లు త్వరగాకోల్కోవాలి
- దేవుడిని ప్రార్ధించిన రాజాలాద్ సింగ్
మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడ్డారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చి జవాన్ల ప్రాణాలు తీశారు. మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు వ్యాన్లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఆ తర్వాత కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 9 సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా.. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్గఢ్లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ మృతిని కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. గాయపడిన జవాన్లు త్వరగా కోల్కోవాలని దేవుడ్ని ప్రార్ధించారు.
My heartfelt condolences to the families of those personnel who lost their lives in Sukma blast. I pray for the speedy recovery of the injured jawans. I spoke to DG CRPF regarding the Sukma incident and asked him to leave for Chhattisgarh, tweets HM Rajnath Singh. (File Pic) pic.twitter.com/43BxXvofth
— ANI (@ANI) March 13, 2018