YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టీమిండియా మహిళా జట్టుకు కెప్టెన్‌ మిథాలీ రాజ్ 

Highlights

  • వైస్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ 
  • మూడు వన్డేలకు వేదిక కానున్నవడోదరా 
టీమిండియా మహిళా జట్టుకు కెప్టెన్‌ మిథాలీ రాజ్ 

టీమిండియా మహిళా జట్టుకు కెప్టెన్‌గా మిథాలీ రాజ్ బాధ్యతలు తీసుకోనున్నారు. వైస్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించనున్నారు. ఐసీసీ మహిళా ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరగనున్న వన్డే సిరీస్ ఈ నెలలో జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా జరగనున్న మూడు వన్డేలకు వడోదరా వేదిక కానుంది. సఫారీ గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్‌తో పోరుకు సిద్ధమౌతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన స్టార్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైంది.

Related Posts