YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సామాజిక కవి జాషువా - మంత్రి శంకరనారాయణ

సామాజిక కవి జాషువా - మంత్రి శంకరనారాయణ

సామాజిక కవి జాషువా - మంత్రి శంకరనారాయణ
అనంతపురం
గుర్రం జాషువా సామాజిక కవి అని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. శనివారం అనంతపురం పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలోనే మహాకవి గుర్రం జాషువా 124వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ 
సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను కవితా వస్తువుగా చేసుకొని విలక్షణమైన కవితా మార్గాన్ని ఏర్పరుచుకున్న కవి గుర్రం జాషువా ని తెలిపారు. తెలుగు సాహిత్యంలో దళితుల దయనీయ స్థితిని సాహిత్య వస్తువుగా తీసుకుని అనేకమంది కవులు తమ రచనల ద్వారా అనగారిన వర్గాల ఆత్మ
గౌరవ అభివృద్ధికి కృషిచేసి, వారిలో చైతన్యం రగిలించడానికి ప్రయత్నించిన గొప్ప కవులలో గుర్రం జాషువా ముందువరుసలో ఉన్నాడని తెలిపారు .1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లాలో వినుకొండలో జన్మించారు . వివిధ సామాజిక సమస్యలను కూడా ప్రత్యేక రచనలు చేసి జాషువా పాండిత్యానికి నిదర్శనంగా నిలిచారు. భారత 
ప్రభుత్వం 1970 లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది అని.1971 లో జూలై 24వ తేదీన గుర్రం జాషువా మరణించారని. ఆయన కవిత్వం మాత్రమే తెలుగు పాఠకుల హృదయాలలో చిరకాలం సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగ లింగన్న, కృష్ణదేవరాయల విశ్వవిద్యాలయ తెలుగు విభాగ పతి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ 
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి, వివిధ దళిత సంఘాల నాయకులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts