YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

నిన్న ఆర్టీసీ ఉద్యోగులు, రేపు ఆరోగ్యశ్రీ కేసీఆర్ కు కొత్త టెన్షన్

నిన్న ఆర్టీసీ ఉద్యోగులు, రేపు ఆరోగ్యశ్రీ కేసీఆర్ కు కొత్త టెన్షన్

నిన్న ఆర్టీసీ ఉద్యోగులు, రేపు  ఆరోగ్యశ్రీ
కేసీఆర్ కు కొత్త టెన్షన్
హైద్రాబాద్, సెప్టెంబర్ 30,
తెలంగాణ వచ్చిన నాటి నుంచి కేసీఆర్ సర్కారు ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఉద్యోగులకు జీతాల పెంపు, ఆసరా ఫించన్ల పెంపు, కళ్యాణ లక్ష్మీ, రైతు బీమా, కేసీఆర్ కిట్.. ఇలా రకరకాల పథకాలతో ప్రజలకు చేరువైంది. తెలంగాణ సంక్షేమ పథకాల ప్రభావం ఏపీ పైన పడింది. దీంతో చంద్రబాబు సర్కారు కూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఎన్నికల ముందు పసుపు కుంకుమ లాంటి తాయిళాలను టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. బాబు కంటే కేసీఆరే మంచి మార్కులు కొట్టేశారు.కానీ ఇటీవల ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ కాస్త మారినట్టు కనిపిస్తోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో కేసీఆర్‌పై మెల్లగా ఒత్తిడి పెరుగుతోంది. అధికారంలోకి వస్తూనే గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసిన జగన్.. తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. అంతేకాదు ఇక నుంచి ప్రతి ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాటిచ్చిన జగన్.. అందుకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నారు.మరో వైపు తెలంగాణాలో పోలీసు ఉద్యోగాల భర్తీ మినహా ఇటీవలి కాలంలో పెద్దగా ఉద్యోగాలను భర్తీ చేయలేదు. బీఏ, బీఎస్సీ, బీకామ్ లాంటి డిగ్రీలు చదివిన యువత గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. బీఈడీ చేసిన వాళ్లయితే.. ఏడాదికోసారి డీఎస్సీ నిర్వహిస్తే బాగుండని కోరుకుంటున్నారు. అసలు తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి. తెలంగాణ వస్తే బోలెడన్నీ సర్కారు ఉద్యోగాలు వస్తాయని, మన పిల్లలు గవర్నమెంట్ జాబులొస్తాయని ప్రచారం చేశారు.కానీ ఆశించిన స్థాయిలో తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జరగలేదనేది కాదనలేని వాస్తవం. ఇటీవలే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. కానీ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఏటా నోటిఫికేషన్లు ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటిచ్చినప్పటికీ.. ఆ హామీ ఇంత వరకూ అమలు కాలేదు.మరోవైపు ఏపీలో ఆర్టీసీ కార్మికులను ఎలాగైతే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారో.. అలాగే తమను కూడా ప్రభుత్వంలోకి తీసుకోవాలని డిమాండ్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ ప్రకటించినట్టుగానే.. కేసీఆర్ కూడా ప్రకటిస్తే బాగుంటుందని తెలంగాణ నిరుద్యోగులు భావిస్తున్నారు.ఇక జగన్ సర్కారు తీసుకోబోయే మరో కీలక నిర్ణయం ఆరోగ్య శ్రీని పటిష్టం చేయడం. హాస్పిటల్ ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామని జగన్ మాటిచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే.. కేసీఆర్‌పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

Related Posts