YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం

బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం

బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం
బీజింగ్, సెప్టెంబర్ 30,
బస్సు ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే చైనాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఝేజియాంగ్ రాష్ట్రంలోని నింఘాయ్ ప్రాంతంలో గల ఓ నిత్యావసరాల తయారీ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19మంది సజీవదహనం కాగా... ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఎనిమిది మందిని సహాయక సిబ్బంది రక్షించారు.అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. చైనా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అత్యంత నాసిరకంగా ఉండటం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జియాంగ్సూ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 36మంది దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరగడంతో చైనాలో విషాదం నెలకొంది. మార్చి22వ యాన్‌చెంగ్ నగరంలోని పురుగుల మందు తయారీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుతో 78 మంది చనిపోగా.. 600 మందికి పైగా గాయపడ్డారు.

Related Posts