YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఎస్ ఐ ని చంపబోయి..ముఠా చిక్కిందిలా... హైద్రాబాద్, సెప్టెంబర్ 30,

ఎస్ ఐ ని చంపబోయి..ముఠా చిక్కిందిలా... హైద్రాబాద్, సెప్టెంబర్ 30,

ఎస్ ఐ ని చంపబోయి..ముఠా చిక్కిందిలా
హైద్రాబాద్, సెప్టెంబర్ 30,
వారం రోజుల క్రితం పోలీసులపై దాడి చేసి పారిపొయిన దోపిడి దొంగలను హైదరాబాద్ పోలీసులు మహారాష్ట్రలో పట్టుకున్నారు. ముగ్గురు సభ్యుల ఈ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఏటీఎం, జ్యువెలరీ షాపుల్లో దోపిడిలకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. దోపిడి సమయంలో తమకు అడ్డం వచ్చిన వారిపై దాడులకు తెగబడటమే కాదు.. అవసరమైతే ప్రాణాలను తీయడానికి కూడా వీరు వెనుకాడరని పోలీసులు తెలిపారు.వారం రోజుల క్రితం ఈ దొంగల ముఠా పేట్ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే దూలపల్లిలోని ఓ జ్యువెలరీ షాపులో చోరీకి యత్నించింది. అల్వాల్‌ ప్రాంతంలో మారుతీ వ్యాన్‌ను దొంగిలించి.. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దాన్ని జ్యువెలరీ షాపు ముందు నిలిపి ఉంచారు.పెట్రోలింగ్‌ నిర్వహిస్తోన్న దుండిగల్‌ ఎస్సై శేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి అదే సమయంలో అటువైపు వచ్చారు. మారుతీ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయడం కోసం పోలీసులు తమ వాహనం దిగారు. వెంటనే అప్రమత్తమైన దొంగలు వాహనంతో ఎస్సై మీదికి దూసుకొచ్చారు. వాహనంతో ఆయన్ను ఢీకొట్టేందుకు ప్రయత్నించారు.కానీ తప్పించుకున్న ఎస్సై వారిని వెంబడించారు. పోలీసులు తరమడంతో నిందితులు దూలపల్లి అటవీ ప్రాంతంలో కారును వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముఠాను పట్టుకోవడం కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. చివరకు ఈ ముఠా మహారాష్ట్రలో పోలీసులకు చిక్కింది.

Related Posts